Headlines
Published On:
Posted by Ts

నాగార్జునకి కోపం తెప్పించిన కెసిఆర్ నిర్ణయం

అక్కినేని నాగార్జునకి కెసిఆర్ నిర్ణయం కోపం తెప్పించింది. ప్రస్తుతం ఇదే టాపిక్ టాలీవుఢ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ మూవీ మనం, బాక్సాపీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కలెక్షన్స్ ఈ రోజు మరింతగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో మనం కలెక్షన్స్ కి బాగా దెబ్బ పడుతుందని అంటున్నారు. ఎందుకంటే టి.ఆర్.ఎస్ పార్టి అధ్యక్షుడు కె.సి.ఆర్ ఈ రోజు తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చాడు. ఈ కారణంతో తెలంగాణ మొత్తంగా ఈ రోజు బంద్ జరగనుంది. తెలంగాణ పార్టి చివరి బంద్ గా దీనిని విజయవంతం చేయాలని కే.సి.ఆర్ కోరారు. ఆ కారణంగానే బంద్ ప్రభావం అన్ని చోట్ల చూపుతుందని విశ్లేకులు అంచానా వేస్తున్నారు. ప్రస్తుత సమయంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, వరుస సక్సెస్ లతో కొద్దిగా లాభాల బాట పడుతుంది. ఇటువంటి సమయంలో బంద్ అనేది డిస్ట్రిబ్యూటర్లకి నిద్రలేకుండా చేస్తుంది. బహుశ తెలంగాణలో ఇదే చివరి బంద్ అని కూడ అంటున్నారు. మొత్తంగా తెలంగాణ బంద్ కారణంతో మనం మూవీ కలెక్షన్స్ దాదాపు 90 లక్షలకు పడిపోవచ్చని అంటున్నారు. దీంతో నాగార్జున కొద్దిగా అసహనంగా ఉన్నారని టాలీవుడ్ టాక్. మనం మూవీ మొదటి ఏడు రోజులు సాధించే కలెక్షన్స్ రికార్డ్స్ లో, ఈ బంద్ ప్రభావం ఎక్కువుగా చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.

About the Author

Posted by Ts on 19:28. Filed under . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

By Ts on 19:28. Filed under . Follow any responses to the RSS 2.0. Leave a response

photos